SKLM: బీఆర్ఆర్ వంశధార ప్రాజక్ట్ పరిధిలోని నౌపడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. టెక్కలి వంశధార కార్యాలయం ఆవరణలో జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. కమిటీ అధ్యక్షుడిగా మల్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడుగా సగ్గు పోతయ్య రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వంశధార ఈఈ బీ. శేఖర్ రావు నియామక ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.