కర్నూలులో లక్ష్మినగర్, మద్దూర్నగర్, ప్రకాశ్నగర్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పి. విశ్వనాథ్ పరిశీలించారు. నిర్లక్ష్యం చేసిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ చెన్నయ్యతో పాటు ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ జరిగేలా చూడాలని, ఫిర్యాదులు రాకుండా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.