అన్నమయ్య: పీలేరు మండలంలోని దేవేంద్ర గోడౌన్లో ఇవాళ కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.