SKLM: నరసన్నపేట మండలం లుకలాం రైతు సేవ కేంద్రంలో రైతులకు వరి విత్తనాలు అందజేశారు. బుధవారం ముసిడిగట్టు సర్పంచ్ సూరన్నాయుడు, లుకలాం మాజీ సర్పంచ్ కన్నేపల్లి లక్ష్మీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొని ప్రభుత్వం రాయితీపై రైతులకు అందిస్తున్న వరి విత్తనాలను అందజేశామన్నారు. విఏఏ లలిత మాట్లాడుతూ.. ఈ కేంద్రానికి 30 కేజీలతో ఉన్న 373 బస్తాలు వచ్చాయన్నారు.