NLR: నగరపాలక సంస్థ పరిధిలో సంపూర్ణ అక్షరాస్యత విషయంలో 2029 నాటికి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి సూచించారు. ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం స్వయం సహాయక బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ నోడల్ ఆఫీసర్ మస్తాన్ ఉన్నత అధికారలు పాల్గొన్నారు.