ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేపు కిషోర్ బాలిక వికాసం పై మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సంతమాగులూరు ఐసీడీసీ సీడీపీవో సుధా తెలిపారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కిషోర్ బాలిక వికాసం శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని అన్నారు.