కృష్ణా: నేడు గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రానున్నట్లు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం వైసీపీ నాయకులతో సమావేశం అవుతారని సమాచారం.