కోనసీమ: జిల్లా వ్యాప్తంగా 108 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1200 ఓటర్లు దాటిన చోట ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అన్నారు.