NLR: కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య పరిస్థితులపై ఎమ్మెల్యే ఇంటూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అనూషతో పాటు సిబ్బందితో సమీక్ష నిర్వహించి, పర్యవేక్షణ లోపాలను ప్రశ్నించారు. కాలువల్లో చెత్త తొలగింపు లేకపోవడం, నిర్లక్ష్యంగా పనులు చేయడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.