SKLM: ‘మొంథా’ తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని APEPDCL జిల్లా సూపరిండెండెంట్ సోమవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబరు 28 నుంచి 31వరకు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు. తడిగా ఉన్న విద్యుత్ స్తంబాలను తాకవద్దని హెచ్చరించారు.