SKLM: ఎచ్చెర్ల మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదాలు చేశారు.