సత్యసాయి: ఏరువాక పౌర్ణమి వేడుకలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని రైతు చెండ్రాయుడు పొలంలో పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా దుక్కి దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి, రైతన్నల భూముల్లో సిరుల పంట పండాలని ఆకాంక్షించారు.