E.G: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జవహర్ను కొవ్వూరులోని కార్యాలయంలో దళిత ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఎస్సీ ఉద్యోగులు కుల వివక్షకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో జీవించాలని కె.ఎస్. జవహర్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జవహర్ హామీ ఇచ్చారు.