ATP: పామిడి మండలం జి కొట్టాల గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పామిడి ఎస్సై సుధాకర్ యాదవ్ శనివారం తన సొంత ఖర్చుతో 5 ట్రాక్టర్ల గడ్డివామును రైతుకు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ఓ రైతు ఆవేదనను అర్థం చేసుకునీ రైతుకు సొంత ఖర్చులతో రూ.లక్ష 50 వేల గడ్డివామును అందజేశామన్నారు.