CTR: పెనుమూరు మండలం చిన్నకలికిరిలో విషాదం నెలకొంది. మునస్వామి కుమారుడు శేఖర్ (27) గ్రామ సమీపంలోని నీవా నది వద్ద ఉన్న పొలం దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. మార్గమధ్యంలో పెద్ద బావి ఉంది. నిన్న రాత్రి కాలి నడక బాటలో బైకుపై వెళ్తుండగా.. రాళ్లు తగిలి అదుపుతప్పి బైక్తో సహా బావిలో పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో బావిలోనే చనిపోయాడు.