కోనసీమ: ముమ్మిడివరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఠాణేలంక పంచాయతీ పరిధిలోని వడ్డిగుడెం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఏడాదిగా సరైన విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందారు. లో-వోల్టేజ్ సమస్య, సిబ్బంది కొరతతో గ్రామం అంధకారంలో ఉందని వాపోయారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.