కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల అయింది. ఉదయం 11:30 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 12:05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరువుతారు. అలాగే 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు, నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరిస్తారు.