కోనసీమ: అమలాపురం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు మార్గశిర మాసం శుక్ల విదియ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.