PPM: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఎన్. ప్రబాకర్ రెడ్డి సోమవారం కలక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియలో నిబంధనలు పాటించని మిల్లర్లపై జిల్లా యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబించాలని సూచించారు. అగ్నిమాపక భద్రతతో సహా కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు పాటించని మిల్లర్లను వెంటనే బ్లాక్లిస్ట్ చేయాలని ఆదేశించారు.