KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని 24వ వార్డులో MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి వార్డులో తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వినతులను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.