TPT: తిరుపతి జీవకోన పరిసర ప్రాంతాల్లో అధునాతన టెక్నాలజీతో 124 CC కెమెరాలు ఏర్పాటు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నేరాలు అదుపు చేసేందుకు సుమారు రూ.31 లక్షలతో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలే ఈ CC కెమెరాలను కాపాడుకోవాలని సూచించారు.