KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యంత్ర 2K25 సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా యుసీఐఎల్ డీజీఎం ప్రభాస్ రంజన్, న్యూటెక్ బయోసైన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ వసంత్ కుమార్, వైజాగ్ పోర్ట్ అథారిటీ అసిస్టెంట్ సెక్రటరీ అజయ్ తేజలు పాల్గొంటారని చెప్పారు.