కృష్ణా: మచిలీపట్నం బందరు కోటలోని మారుతీ స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం కొంత మంది వ్యక్తులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆలయ కమిటీ సభ్యులు అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గురువారం వారు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని వారు కోరారు.