కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం అవంతి సీఫుడ్ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీకై మైగాపుల కొండేశ్వరరావు(47) అనే మిషన్ ఆపరేటర్ మృతి చెందాడు. ఈనెల 10వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన కొండేశ్వరరావును అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు.