కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గంలో కొలువుతీరి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి తరఫున గురువారం సారె సమర్పించారు. ఆలయ నూతన ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు, ఆలయ అర్చకులు ఈ సారె సమర్పించారు.