VZM: ఇమామ్, మౌజాన్ల గౌరవ వేతనాన్ని గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లులను విడుదల చేశారని విజయనగరం ఎమ్మెల్యే అతిది గణపతిరాజు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తప్పుడు హామీలిచ్చారన్నారు.