NRML: బైంసా పట్టణంలో నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసే అంజి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.