SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ పోటీల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.