NDL: బనగానపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన అన్నారు.