విశాఖ: సింహాచలం దేవస్థానానికి సంబంధించి పంచ గ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి సింహాచలంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనిపై సింహాచలం ఛైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు పలువురుతో చర్చించినట్లు తెలిపారు.