AKP: 74వ వార్డులో శుక్రవారం ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, జోనల్ కమిషనర్ శేషాద్రి పాల్గొన్నారు.