E.G: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనపర్తి నియోజకవర్గంలో ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎంతో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధి పనుల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. సీఎంకు వివరాలను తెలియజేసి వినతిపత్రం ఇచ్చారు.