సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కుల జన గణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఐకమత్యమే మహాబలమని బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.