NLR: పొన్నలూరు(మం) కే. అగ్రహారంలో అప్పుగా తీసుకున్న డబ్బు అడిగినందుకు ఇద్దరు తనపై దాడి చేశారని కొత్తపాలెంకి చెందిన బాధితుడు వెంకటరెడ్డి (చిన్నా) వాపోయాడు. అగ్రహారంకి చెందిన వంగపాటి ప్రసాద్, అతని సోదరుడు రామాంజనేయులు టీడీపీ (MPTC) మాట్లాడుకోవడానికి పిలిచి కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపించాడు. అనంతరం వెంకటరెడ్డిని ఆసుపత్రికి తరలించారు.