ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఎన్జీఓ హోం సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. సమావేశానికి పెన్షనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.