ELR: ఈనెల 23న మధ్యాహ్నం రెండు గంటలకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్ తెలిపారు. నూజివీడులో ఆయన గురువారం మాట్లాడుతూ.. ఎంపీపీ ఆరేపల్లి శిరీష అధ్యక్షతన నిర్వహించే సర్వసభ్య సమావేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి ప్రణాళికతో ముందడుగు వేసేందుకు సమావేశం ఉంటుందన్నారు.