GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు ‘రైతన్న సేవలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు తెలిపారు. ప్రతి రైతును కలిసి కూటమి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని ఆదివారం ఆయన పేర్కొన్నారు. గుంటూరు విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.