TPT: ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడం ఏర్పడనుందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తిరుపతిలోను ఈనెల 17, 18 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.