TPT: స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో పాటు వారి తండ్రి నేత్రాలను సైతం వారి మరణాంతరం అందించేలా ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు.