కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయికి ప్రభుత్వం వికేంద్రీకరణ చేసిందన్నారు.