కోనసీమ: అంతర్జాతీయ యోగాదినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ జగన్మోహిని కేశవ గోపాల స్వామి వారి ఆలయంలో గురువారం యోగాంద్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాలకు అనుగుణంగా యోగ కార్యక్రమం నిర్వహించినట్లు ఈఓ మూర్తి తెలిపారు. రాజవరం పాఠశాల ఉపాధ్యాయులు యోగా శిక్షకులు వెంకటరాజు పాల్గొని ఆలయ సిబ్బంది యోగ పై శిక్షణ ఇచ్చారు.