W.G: జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం రైతన్నలకు అండగా అంటూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి జిల్లా నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలకొల్లు వైసీపీ కార్యాలయం నుండి ఇన్ఛార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో భారీగా వైసీపీ నేతలు తరలి వెళ్లారు. అలాగే రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు.