TPT: గుంటూరుకు చెందిన అలపాటి సురేష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,11,111 విరాళంగా అందించారు. భక్తుల సేవార్థం అన్నప్రసాదం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్యచౌదరి వారికి అందజేశారు.