KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో శుక్రవారం ఉదయం పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీనరసయ్య పారిశుద్ధ్య కార్మికులచే చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు.అలాగే ఇంటింటా చెత్త సేకరించి తడి పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.