SKLM: పాతపట్నంలో కొలువై ఉన్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర రావు గురువారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.