PLD: వినుకొండ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆరోగ్యకర జీవనశైలికి శారీరక శ్రమ అవసరమని ఆయన తెలిపారు. యువతతోపాటు వృద్ధులు కూడా ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెప్పారు.