చిత్తూరు: అప్పుల బాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ఎస్సై నరసింహుడు కథనం మేరకు.. ములకలచెరువు మండలం చీకిచెట్టుపల్లికి చెందిన బైరెడ్డి టమాట పంట సాగులో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చేసిన రూ. 6 లక్షల అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి లోనై పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.