PPM: కొమరాడ జంరూవతి రబ్బరు డ్యాంలో ఆదివారం ముగ్గురు యువకులు గల్లంతుపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. యువకులు సివిని గ్రామానికి చెందిన వారని మంత్రికి వివరించినట్లు కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారని తెలిపారు.