ASR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్ అన్నారు. గురువారం హుకుంపేట మండలం ఉప్ప గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సత్యారావుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలన్నారు