KRNL: వైసీపీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దకడబూరుకు చెందిన గ్రామ సర్పంచ్ ఎం. రామాంజినేయులు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసింది. తనపై నమ్మకంతో చేతివృత్తుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వైసీపీ అధినేత జగన్కు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.